sdfgh0983

పట్టాలు తప్పిన రైలు

ఈ ఘటనలో ఇప్ప‌టి వ‌ర‌కూ 61 మంది ప్రయాణికులు మృతి చెందారు. మ‌రో 52 మంది గాయపడ్డార‌ని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక గవర్నర్ తెలిపారు.

కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు బయోఫ్వే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాద స‌మ‌యంలో రైలుకు 15 బోగీలు ఉండ‌గా...ఏడు రైలు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి 11:50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఇప్ప‌టి వ‌ర‌కూ 61 మంది ప్రయాణికులు మృతి చెందారు. మ‌రో 52 మంది గాయపడ్డార‌ని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక గవర్నర్ ఫిఫీ మసుకాను తెలిపారు. ఏడు మృతదేహాలను బాధిత‌ కుటుంబాలు అప్ప‌గించ‌మ‌నీ, మరో 53 మృత దేహాల‌ను గుర్తిస్తున్నారని స్థానిక అధికారి జీన్-సెర్జ్ లుము విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

కాంగోలో ప్యాసింజర్ రైళ్లు లేక వెళ్లేందుకు వీలుగా రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించేందుకు గూడ్స్ రైళ్లను ఉపయోగిస్తున్నారు. గత అక్టోబర్‌లో ఇదే ప్రావిన్స్‌లోని ముత్సత్షా ప్రాంతంలోని కెంజెంజ్ నగరంలో రైలు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించారు.2019లో, కసాయి ప్రావిన్స్‌లోని బెనా లేకా సెటిల్‌మెంట్‌లో స్టోవావేలను తీసుకువెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో జరిగిన ప్రమాదంలో 24 మంది మరణించిన విషయం తెలిసిందే.


Comment As:

Comment (0)