రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించు కోవడానికి ఢిల్లీ బయలు దేరిన అరుకు ఎంపీ మాధవి.
రేపు దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో జరుగునున్న రాష్ట్రపతి ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించు కోవడానికి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరిన అరకు పార్లమెంట్
రేపు దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో జరుగునున్న రాష్ట్రపతి ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించు కోవడానికి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరిన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక గిరిజన మహిళకు దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము గారికి ఎన్డిఏ ప్రభుత్వం నామినేట్ చేయడం గర్వించదగ్గ విషయమని, జగనన్న సారథ్యంలో_గిరిజన మహిళ శ్రీ ద్రౌపతి ముర్ము గారికి మద్దతుగా ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా,గర్వంగా ఉందని ఎంపీ తెలిపారు.
రిపోర్టర్ హరి