జడ్పీ చైర్మన్ గారి కలిసి వినతి పత్రం అందజేసిన మలిదశ ఉద్యమ కారులు
నల్గొండ పట్టణం జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఆదివారం రోజున వారి యొక్క స్వగృహమునందు మలిదశ ఉద్యమ కారుల కుటుంబం కలిసి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.
- By khaja --
- Sunday, 27 Mar, 2022
నల్గొండ పట్టణం జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఆదివారం రోజున వారి యొక్క స్వగృహమునందు మలిదశ ఉద్యమ కారుల కుటుంబం కలిసి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.
మా కుటుంబం ఉద్యమాన్నే నమ్మి, ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి , గులాబీ జెండా పట్టుకొని నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా పట్టణం నందు వీరోచిత పోరాటం చేసిన ఘనత యావత్ జిల్లాకు తెలిసిన విషయమే...
ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నియామకాల లో హాలియా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఉద్యమకారుల కుటుంబానికి ఇచ్చి గులాబీ పార్టీలో గుర్తింపు ఉండేవిధంగా న్యాయం చేయగలరని ఉద్యమ నమస్సుమాంజలిల తో కోరుకోవడం జరిగింది.
వారు సానుకూలంగా స్పందిస్తూ ... నియోజకవర్గ ముఖ్య నాయకులతో మాట్లాడి ఉద్యమకారులకు గౌరవప్రదమైన స్థానం కలిగే విధంగా ఉద్యమ సమయంలో చేసిన సేవలు గుర్తుండే విధంగా తన వంతు అధిష్టానానికి పార్టీ హైకమాండ్ కి తెలియపరుస్తానంటు హామీ ఇవ్వడం జరిగినది.
khaja