ఆస్తి కోసం పన్నాగం..సొంత పెద్దనాన్నే హంతకుడు.

ఆస్తి కోసం పన్నాగం..సొంత పెద్దనాన్నే హంతకుడు.

అసిఫాబాద్: మనవాళ్ళు ఎవరో పగవాళ్ళు ఎవరో అర్ధం కాని పరిస్థితి నెలకొంది ఈ కలియుగంలో, తన సొంత పెద్దనాన్నే ఆస్తి కాజేయడానికి తనపై హత్యకు పన్నాగం పన్నాడు అని తెలుసుకోకుండానే ఓ అభాగ్యురాలు హత్యకు గురి అయ్యిన సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో చోటు చేసుకుంది. పెంచికల్ పెట్ మండలం కమ్మర్ గాంలో ఈ నెల 6 వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ కేసును రోజుల వ్యవధిలోనే పోలీసులు ఛేధించారు. మంగళవారం కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రూరల్ సీఐ నాగరాజు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలను వెళ్ళడించారు. దుర్గం దస్తూ బాయి అనే మహిళను ఆస్తి కొరకే తన సొంత పెదనాన్న, అతని కొడుకు కలసి సుపారీ గ్యాంగుతో లక్ష రూపాయల ఒప్పందం కుదుర్చుకుని హత్యకు పాల్పడినట్టు తెలిపారు. ఆత్మహత్యగా సృషించేందుకు హత్య చేసిన అనంతరం నోటిలో పురుగుల మందును పొసారని పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా గొంతునులిమి హత్య చేసినట్టు రిపోర్ట్ రావడంతో విచారణ నిర్వహించిన తాము మృతురాలి పెదనాన్న అతని కొడుకుతో పాటు ఏడుగురు సూపరి గ్యాంగ్ ను కలిపి 9 మందిని అదుపులోకి తీసుకొని రేమండ్ కు తరలించామని అన్నారు.

Banka Srinivas

Comment As:

Comment (0)