revanthreddy1-1676447772

రూ.2 లక్షల రైతు రుణమాఫీ, భూమి లేని రైతుకు రూ.15 వేలు..

రూ.2 లక్షల రైతు రుణమాఫీ, భూమి లేని రైతుకు రూ.15 వేలు..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర జనగామ జిల్లా దేవరుప్పులలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా మహిళా రైతులతో ఆయన మాట్లాడారు. పొలంలోకి దిగి మహిళలతో కలిసి నాటేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని రైతులకు రూ.15 వేలు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు.


Comment As:

Comment (0)