రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ నూతన కార్యవర్గం కమిటీ ఎన్నిక
కర్నూలు నగరం, కల్లూరులో బుదవారం రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ సమావేశం జరిగింది. సమావేశంలో జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి పలు సమస్యలపై చర్చించారు ముఖ్యంగా స్థానిక పత్రికలు ఎదుర్కుంటున్న ఆక్రిడిటేషన్స్ రెన్యువల్ తదిర సమస్యలపై చర్చించారు
- By V.VKR --
- Wednesday, 20 Jul, 2022
కర్నూలు నగరం, కల్లూరులో బుదవారం రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ సమావేశం జరిగింది. సమావేశంలో జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి పలు సమస్యలపై చర్చించారు ముఖ్యంగా స్థానిక పత్రికలు ఎదుర్కుంటున్న ఆక్రిడిటేషన్స్ రెన్యువల్ తదిర సమస్యలపై చర్చించారు. అనంతరం నూతన కార్యవర్గం కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. అధ్యక్షులుగా బత్తిన నవీన్,ప్రధాన కార్యదర్శిగా సిరిపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా... ఎస్ ఎన్ రాజు, ఎస్.ఎం బాషా, జాయింట్ సెక్రటరీలుగా రాజేంద్ర ప్రసాద్, సృజన కుమార్, ట్రైజరర్ గా ఇస్సాక్ (సర్దార్ బాషా), మీడియా కన్వీనర్ గా డి.షరీఫ్, కుమార స్వామి, వెంకట్, కమిటీ నెంబర్స్ గా పి.వెంకటేష్ లు ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన రాయలసీమ కమిటీ సభ్యులు త్వరలో కార్యాచరణకు సంబంధించిన విసయాలు వెలాడిస్తామని చెప్పారు.జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు.
V.VKR