త్వరలో తల్లుల ఖాతాల్లో విద్యార్థుల యూనిఫాం కుట్టుకూలీ జమ*డాక్టర్ కె.వేణుగోపాల్,*కర్నూలు,నంద్యాల ఏ

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తల్లుల ఖాతాల్లో విద్యార్థుల యూనిఫాం కుట్టుకూలీ జమ చేస్తున్నట్లు కర్నూలు,నంద్యాల ఏపీ ఎస్ ఎస్ ఎ అడిషనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వేణుగోపాల్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తల్లుల ఖాతాల్లో విద్యార్థుల యూనిఫాం కుట్టుకూలీ జమ చేస్తున్నట్లు కర్నూలు,నంద్యాల ఏపీ ఎస్ ఎస్ ఎ అడిషనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వేణుగోపాల్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 4,72,844 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.వీరందరికీ జగనన్న విద్యా కానుక పేరుతో ప్రభుత్వం మూడు జతల ఏకరూప వస్త్రాలు అందిస్తుందని అన్నారు.జెవికె 2021-22 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలీ జమ చేయడానికి రాష్ట్ర పథక సంచాలకుల వారి నుంచి ఇటీవలే ఉత్తర్వులు విడుదలయ్యాయని చెప్పారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2021-22 విద్యాసంవత్సరానికిగాను మొత్తం విద్యార్థుల సంఖ్య 4,68,662 మంది.అందులో ఒకటి నుంచి 8వ తరగతి చదివే 3,90,659 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో ఒక్కొక్క విద్యార్థికి రూ.120 చొప్పున మొత్తం అందరికీ రూ.46,87,908 లక్షలు,9,10వ తరగతి చదివే 78003 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో ఒక్కొక్క విద్యార్థికి రూ.240 చొప్పున మొత్తం అందరికీ రూ.18,72 ,07,202 కోట్లు త్వరలో జమ చేయబడతాయని ఆయన పేర్కొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)