ఉపాధిహామీలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఉపాధిహామీలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఉపాధిహామీ పథకంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీఓ సురేందర్ అన్నారు. బెజ్జూర్ మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధిహామీ అధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీలో నిర్లక్ష్యం వద్దని, అధికారుల నిర్లక్ష్యాన్ని సహించమని, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. చేపట్టిన పనులకు వెంటనే బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.
KOTA SAIKRISHNA